సికిల్‌సెల్‌ ఎనీమియాకు మెరుగైన చికిత్స | Improved treatment for Sickleswell Anemia | Sakshi
Sakshi News home page

సికిల్‌సెల్‌ ఎనీమియాకు మెరుగైన చికిత్స

Sep 23 2017 2:09 AM | Updated on Sep 23 2017 2:11 AM

Improved treatment for Sickleswell Anemia

సాక్షి, హైదరాబాద్‌: సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధిని ఎదుర్కొనేందుకు కౌన్సిల్‌ ఫర్‌ సైంటి ఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) నడుం బిగించింది. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) నేతృత్వంలో ఈ వ్యాధిని సులువుగా గుర్తించేందుకు చికిత్స విధానాలను మెరుగుదలకు ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.54 కోట్లు ఖర్చు చేయనున్నట్లు శుక్రవారం సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది పిల్లలు ఈ వ్యాధిబారిన పడుతున్నారని, వీరిలో సగం మంది భారత్‌లోనే ఉన్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న గిరిరాజ్‌ ఛాందక్‌ మాట్లాడుతూ జన్యు మార్పుల కారణంగా సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధిగ్రస్తుల్లోని రక్తకణాలు కొడవలి ఆకారంలోకి మారిపోతాయని, ఫలితంగా రక్తహీనత, విపరీతమైన ఒళ్లునొప్పులు వస్తుంటాయని వివరించారు. భారత్‌లో ఈ వ్యాధిగ్రస్తులు చత్తీస్‌గఢ్‌లో ఎక్కువగా ఉండగా.. ఏపీతో పాటు మహారాష్ట్ర, ఒడిశాల్లోనూ వ్యాధిబారిన పడిన వారు ఉన్నారని తెలిపారు. సికిల్‌సెల్‌ ఎనీమియాకు సమర్థమైన చికిత్స అందించడమే కాకుండా అతిచౌకగా వ్యాధి నిర్ధారణ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement