ఫైనాన్షియర్ల వేధింపులకు మరో మహిళ బలైంది.
ఫైనాన్షియర్ల వేధింపులకు మరో మహిళ బలైంది. తీసుకున్న అప్పు కట్టడంలో ఆలస్యం అయ్యేసరికి అప్పు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కవయ్యాయ. దీంతో మనస్తాపానికి గురైన మహిళ విషపు ఇంజెక్షన్ శరీరంలోకి ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నగరంలోని రైన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదన్నపేటలో గురువారం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభిచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.