నగరంలో సూది సైకో కలకలం | syringe-psycho-stabs-women -in-hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో సూది సైకో కలకలం

Dec 5 2015 10:34 AM | Updated on Sep 3 2017 1:33 PM

నగరంలో సూది సైకో కలకలం

నగరంలో సూది సైకో కలకలం

నగరంలో మరో మారు సూది సైకో రెచ్చిపోయాడు. బైక్ పై వెళ్తున్న మహిళ పై సూదితో దాడి చేసి పరారయ్యాడు.

వనస్థలిపురం: నగరంలో మరో మారు సూది సైకో రెచ్చిపోయాడు. బైక్ పై  వెళ్తున్న మహిళ పై సూదితో దాడి చేసి పరారయ్యాడు. ఈ సంఘటన  వనస్థలిపురం పరిధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రమాదేవి(38) అనే మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగుడు సూదితో దాడి చేశాడు.
 
ఇది గుర్తించిన ఆమె కేకలు వేసే లోపే దుండగుడు అక్కడి నుంచి ఉడాయించాడు. సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ పుటెజ్ లను పరిశీలిస్తున్నారు. రమాదేవి ఓ కాలేజ్ లో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement