తీవ్ర మనస్తాపంతో పురుగులమందు తాగిన రాప్తాడు రైతు నారాయణరెడ్డి రుణమాఫీ జరగకపోవడంతో దారుణం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ నమ్మి మోసపోయిన మరోరైతు ఉసురు తీసుకునే ప్రయత్నంచేశాడు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను వేలం వేయనున్నట్లు పత్రికల్లో ప్రకటించడంతో అవమానభారం భరించలేక అనంతపురం జిల్లాకు చెందిన వై.నారాయణరెడ్డి బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వాస్పత్రి ఐసీయూలో వెంటిలేటర్పై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండలం యర్రగుంటకు చెందిన నారాయణరెడ్డి ఆత్మాభిమానంతో, అవమానభారంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. అతనికి పదెకరాల పొలముంది. ఏటా వేరుశనగ సాగు చేస్తున్నాడు. ఈ ఏడాదీ వేసినా పూర్తిగా దెబ్బతినింది. దీనికితోడు ఇటీవల దాదాపు రూ.1.50 లక్షలు ఖర్చు చేసి పొలంలో మూడు బోరుబావులు త వ్వించినా చుక్క నీరు పడలేదు.
వ్యవసాయంకోసం అదే మండలంలోని బండమీదపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.87 వేల పంటరుణం తీసుకున్నాడు. ఆవుల కోసం రూ.35 వేల రుణాన్ని రాప్తాడు కెనరా బ్యాంకులో తీసుకున్నాడు. అనంతపురం కెనరా బ్యాంకులో 48 గ్రాముల బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణం రూ.1.16 లక్షలుంది. భార్య నాగేంద్రమ్మ పేరుతో రూ.46 వేల డ్వాక్రా అప్పు ఉంది. ఇవి కాకుండా మరో రూ.2.75 లక్షల ప్రైవేటు అప్పులున్నాయి. మొత్తమ్మీద రూ. 6.02 లక్షల అప్పుంది. చంద్రబాబు చెప్పిన మాట మేరకు డ్వాక్రా, వ్యవసాయ, బంగారు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తే రూ.3.34 లక్షలు రుణమాఫీ కావాలి.
అయితే ఇతనికి అన్ని రుణాలు కలిపి రూ.21,026 మాత్రమే మాఫీ అయ్యింది. మరోవైపు అప్పు చెల్లించకపోతే బంగారం వేలం వేస్తామని బ్యాంకు అధికారులు 28వ తేదీన నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 7న వేలం వేస్తామంటూ బుధవారం పత్రికల్లో నోటీసులు ఇచ్చారు. దీంతో నారాయణరెడ్డి కుంగిపోయాడు. తన పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.
రుణమాఫీ అయ్యుంటే ఇలా జరిగేది కాదు
మాకు రుణమాఫీ అయ్యుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పంటలు పండక అప్పులు ఎక్కువయ్యాయి. పెద్దోణ్ని ఇంటర్ వరకు చదివించాం. ఆర్థిక స్తోమత లేక ఇంట్లోనే ఉంటున్నాడు. చిన్నోన్ని ఇంటర్ చదివిస్తున్నాం. ఓ పక్క నోటీసులొచ్చాయి. మరో పక్క అప్పులిచ్చినోళ్ల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువవుతోంది. అందుకే ఆయనీ పని చేశాడు. - నాగేంద్రమ్మ (రైతు నారాయణరెడ్డి భార్య)
అవమాన భారంతో... రైతు ఆత్మహత్యాయత్నం
Published Thu, Jul 30 2015 3:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement