పర్యాటకులపై తేనెటీగల దాడి: 22 మందికి గాయాలు | 22 injured in bees attack | Sakshi
Sakshi News home page

పర్యాటకులపై తేనెటీగల దాడి: 22 మందికి గాయాలు

Oct 17 2015 1:45 PM | Updated on Sep 3 2017 11:06 AM

ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌ వద్ద పర్యాటకులపై శనివారం తేనెటీగలు దాడి చేశాయి.

పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌ వద్ద పర్యాటకులపై శనివారం తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు. వారిని పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని బృందావన్ కాలనీకి చెందిన 44 మంది కిన్నెరసాని రిజర్వాయర్‌ను చూసేందుకు ఈ రోజు ఉదయం వచ్చారు. రిజర్వాయర్‌ను చూసి వెళుతుండగా బ్రిడ్జి కింద ఉన్న తేనె తుట్టెపై కొందరు రాళ్లు రువ్వడంతో అవి పర్యాటకులపై దాడి చేశాయి. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆస్సత్రి కి తరలించారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement