కుక్కల దాడి: రెండేళ్ల చిన్నారి మృతి | 2 years old child dies in dogs attack | Sakshi
Sakshi News home page

కుక్కల దాడి: రెండేళ్ల చిన్నారి మృతి

Jan 28 2016 2:20 PM | Updated on Sep 29 2018 4:26 PM

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుక్కల దాడిలో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన పుల్లయ్య కుమార్తె అనన్య(2) గురువారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం సమయానికి ఆమె గ్రామ సమీపంలోని పొలాల్లో విగతజీవిగా ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె శరీరంపై గాట్లు ఉండటంతో గ్రామంలో తిరుగుతున్న కుక్కలే ఆమెను ఈడ్చుకెళ్లి చంపి ఉంటాయని భావిస్తున్నారు.  పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement