సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే హై పెర్ఫార్మెన్స్ క్యాంప్కు హైదరాబాద్ స్పిన్ బౌలర్ అనన్య దుండు ఎంపికైంది. అండర్–15 బాలికల విభాగంలో ఆమెకు ఈ అవకాశం దక్కింది.
బెంగళూరులోని బీసీసీఐ–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఈ నెల 18 నుంచి 11 జూన్ వరకు ఈ క్యాంప్ జరుగుతుంది. ఇటీవల జరిగిన బీసీసీఐ అండర్–15 వన్డే ట్రోఫీ (ఎలైట్)లో అనన్య 6 మ్యాచ్లలో 16 వికెట్లు పడగొట్టి టోర్నీ టాపర్గా నిలిచింది. బోర్డు అపెక్స్ కౌన్సిల్ మెంబర్ వి.చాముండేశ్వరనాథ్ పర్యవేక్షణలో నగరంలోని రామానాయుడు క్రికెట్ అకాడమీలో ప్రస్తుతం అనన్య శిక్షణ పొందుతోంది.


