అది 1999, సెప్టెంబరు 27వ తేదీ. కూతురు పుట్టిందని సంతోషించాడు దురైకన్ను. ఇంతలోనే పిడుగు లాంటి వార్త... పుట్టిన బిడ్డకు కళ్ళు కనబడవని, భవిష్యత్తులో కూడా చూపు వచ్చే పరిస్థితి లేదన్నారు డాక్టర్లు. భోరున విలపించాడు దురైకన్ను. కూతురు అంధత్వంతో పుట్టిందన్న బాధ కన్నా తమ తర్వాత బిడ్డకు ఎవరు తోడుంటారన్నదే ఆదంపతులను తీవ్రంగా బాధించిన అంశం.
అయితే భవిష్యత్తులో ఆమే ఆ ఇంటికి దీపమవుతుందని వారు ఆ రోజు ఊహించకపోయి ఉండవచ్చు.ఆ అమ్మాయే స్వర్ణలక్ష్మి. పాండిచ్చేరి ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ప్లస్వన్ చదువుతోంది. పదవ తరగతిలో 458 మార్కులు తెచ్చుకుంది. అందులో ఏ విశేషమూ లేదు. కానీ విశేషం ఏమిటంటే... ఆమె రెండుసార్లు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించింది.
2013వ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అమెరికా, చైనా, అర్జంటీనా, ఉరుగ్వే, ఉగండా దేశాల ప్రతినిధుల తర్వాత స్వర్ణలక్ష్మి వంతు వచ్చింది. భారత్లో మహిళలపై జరుగుతున్న దురాగతాలు, అత్యాచారం, నేరాలు, వారి హక్కుల హరించడం, స్త్రీల హక్కులపై పురుషుల అధిక్యంతో పాటు సంప్రదాయాల పేరిట మహిళలకు ఎదురవుతున్న అసమానత్వం, అవమానాలు, బాల్యవివాహాలు, బాలికలను విద్యకు దూరంగా ఉంచడం లాంటి సమస్యలను ఆధారాలతో సహావివరించింది. అలాగే చిన్నపిల్లలను చదువుల పేరిట ఆటలకు దూరంగా ఉంచడం మీద కూడా వ్యాఖ్యానించింది.
తల్లిదండ్రులు తమ బాధ్యత పేరిట పిల్లల హక్కులను హరించడం, తమ ఆశల కోసం చిన్నారులపై భారాన్ని మోపడంతో చిన్నారులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించింది. మహిళలు, చిన్నపిల్లల హక్కులపై స్వర్ణలక్ష్మి చేసిన ఏడు నిమిషాల ప్రసంగం అనేక దేశాల ప్రతినిధులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో మహిళలు, చిన్నపిల్లలపై హక్కులపై మరింత సమాచారంతో మరోసారి ప్రసంగించాల్సిందిగా ఐరాస నుండి ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం మేరకు 2013 అక్టోబర్లో ఐదు నిమిషాల పాటు ప్రసంగించింది. అలా ఐక్యరాజ్యసమితిలో ఒకే ఏడాదిలో రెండుసార్లు ప్రసంగించింది స్వర్ణలక్ష్మి.
ఇంతకీ ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అవకాశం ఎలా వచ్చిందంటే... స్వర్ణలక్ష్మి పాఠశాల నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాలి. చెన్నైలోని లిటిల్ప్లవర్ పాఠశాలలో నిర్వహించే వకృత్వం, వ్యాసరచన, కీబోర్డు వాయించడం తదితర రంగాలలో తన ప్రతిభను కనబరిచిందామె. పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించే మాక్ పార్లమెంట్లో సమాచార శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా రాణించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మాక్ పార్లమెంట్లో స్వర్ణలక్ష్మి చేసిన ప్రసంగాలను విదేశీ స్వచ్ఛంద సంస్థల ద్వారా తెలుసుకున్న ఐకాస ప్రతినిధులు తమ వేదికపై ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందుకుంది. మనిషి మేధాసంపత్తికి, ప్రతిభకు అంధత్వం అడ్డుకాదని నిరూపించింది.
- కోనేటి వెంకటేశ్వర్లు, న్యూస్లైన్, చెన్నై, ఫొటోలు: చుండి ముకుందరావు
కంటిచూపు లేకపోతేనేం...ఇంటి దీపమయింది!
Published Wed, Jul 23 2014 12:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement