నా వయసు 22. నాకిది మొదటికాన్పు. నెల రోజుల తర్వాత ప్రవసం కానుంది. నవజాత శిశువునకు తల్లిపాలు పట్టడం ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎంతకాలం తాగించాలి? అవి సమృద్ధిగా రాకపోతే బయటిపాలలో ఏవి మంచివి? నాకు మంచి సలహా ఇవ్వగలరు.
- విమల, వనస్థలిపురం
ప్రసవసమయంలో తల్లితోపాటు శిశువు కూడా శ్రమకు గురవుతాడన్న విషయం గుర్తుంచుకోవాలి. జన్మించిన పిదప సేదదీరడం కోసం మూడు నాలుగు గంటలపాటు శిశువుకు విశ్రాంతినివ్వాలి. ఏమీ తాగించనవసరం లేదు. అనంతరం శిశువు ఆరోగ్యం బాగుందని నిర్ధారణ చేసిన పిదప తల్లిపాలు ఇవ్వడానికి ప్రయత్నించాలి. అలా పాలు తాగగలగడం శిశువునకు సంక్రమించే సహజసిద్ధమైన ప్రక్రియ. తల్లి సంతోషంతో శిశువును చూడటం, తాకడం, స్తనాన్ని నోటికి అందించడం ‘స్తన్యం’ స్రవించడం సఫలమవుతుంది. తనకెంత కావాలో శిశువుకి తెలుసు. అనంతరం తల్లి ప్రయత్నించినా తాగడు. అది గుర్తించి బలవంతంగా తాగించవద్దు. శిశువు ఏడవడానికి చాలా కారణాలుంటాయి. అందులో ‘ఆకలి’ కూడా ఒకటి.
ముర్రుపాలు (కొలొస్ట్రమ్) శిశువుకు చాలా మంచిది. బలకరం. విరేచనం సాఫీగా అయ్యేట్టు చేస్తాయి. బిడ్డకు ఒక సంవత్సరం వయసు వచ్చేవరకు స్తన్యం తాగించాలి. ఆరవనెలలో ఫలప్రాశన, పదవ నెలలో అన్నప్రాశన తప్పనిసరి. ఇతర పోషకవిలువలు బిడ్డకందించడానికి ఇది చాలా అవసరం. సరియైన ఫలాలు లభించకపోతే ఆరవనెలలోనే అన్నప్రాశన చేయాల్యల్సి ఉంటుంది. ఇది సుశ్రుతాచార్యులు చెప్పిన విషయం. శిశువులో రోగనిరోధక శక్తి పరిపుష్టమవడానికి, శారీరక, మానసిక వికాసానికి, ఆయుఃవృద్ధికి, సంపూర్ణ ఆరోగ్యానికి స్తన్యపానం అత్యంతావశ్యకమని ఆయుర్వేద గ్రంథాలన్నీ నొక్కివక్కాణించాయి. దీనినే ‘ఓజోవర్థనం’ అంటారు.
తల్లిపాలు తక్కువయిన పక్షంలో ‘ఆవుపాలు, మేకపాలు’ శ్రేష్ఠమని ఆయుర్వేదోక్తం. వీటిలో నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. ఒక చిటికెడు పసుపువేసి మరిగించి, చల్లార్చి, చక్కెర కలిపి తాగించవచ్చు. శతావరీ చూర్ణం (5 గ్రాములు), పాలతో కలిపి, రెండుపూటలా తల్లి సేవిస్తే, తల్లికి సమృద్ధిగా స్తన్యం ఉత్పత్తి అవుతుంది. తల్లికి జ్వరం గాని, రొమ్ముపై స్థానికంగా రోగాలుగాని ఉన్నప్పుడు తాత్కాలికంగా బిడ్డకు స్తన్యపానాన్ని ఆపాల్సి ఉంటుంది. ఒక నెల వయసు దాటిన అనంతరం బిడ్డకు ఒకటి లేదా రెండు చుక్కల గాడిదపాలు తాగిస్తే చాలా జబ్బులను నివారించే రోగనిరోధకశక్తి కలుగుతుందని శాస్త్రోక్తం.
ప్యాకెట్ పాలుగాని, డబ్బాపాలు గాని తెచ్చుకోవడం అనివార్యమైతే అవి ‘కల్తీ’ లేనివని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. ‘నువ్వులు, బెల్లం, వెల్లుల్లి, తాజాఫలాలు, పాలు’ సేవిస్తే తల్లికి స్తన్యోత్పత్తి పుష్కలంగా జరుగుతుంది. ముడిబియ్యంతో వండిన అన్నం మంచిది. సాత్వికాలోచన, సంతోషం స్తనకరం. శోకం, దుఃఖం, చింత, అసూయ వంటి ప్రతికూల ఉద్వేగాలు స్తన్యనాశనకరం.
మొదటికాన్పు... బిడ్డకు పాలుపట్టడం ఎలా?
Published Tue, Oct 8 2013 12:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement