దేశ రాజకీయాల్లో బీహార్ తీరే వేరు. పాట్నాసాహిబ్ లోక్సభ నియోజకవర్గంలో ఈనెల 17న జరిగిన పోలింగ్లో 12-14 ఏళ్ల పిల్లలు సైతం ఓట్లు వేశారు
దేశ రాజకీయాల్లో బీహార్ తీరే వేరు. పాట్నాసాహిబ్ లోక్సభ నియోజకవర్గంలో ఈనెల 17న జరిగిన పోలింగ్లో 12-14 ఏళ్ల పిల్లలు సైతం ఓట్లు వేశారు. పాట్నాసాహిబ్ నియోజకవర్గంలోని జమాల్బిఘా గ్రామంలో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే, ఆ గ్రామంలో చాలామంది వేలిపై ఓటు వేసినట్లుగా ఎలాంటి సిరాగుర్తు లేదు. ఊళ్లో ఈసారి చాలామంది పిల్లలు కూడా ఓటు వేశారని, మళ్లీ మళ్లీ ఓటు వేసేందుకు వీలుగా చాలామంది వేలిపై సిరాగుర్తు వేయించుకోలేదని రామ్ వినయ్ కుమార్ సింగ్ అనే గ్రామస్తుడు చెప్పారు.