రాజంపేట టీడీపీలో తారస్థాయికి చేరిన విభేదాలు | tdp disputes in rajam peta | Sakshi
Sakshi News home page

రాజంపేట టీడీపీలో తారస్థాయికి చేరిన విభేదాలు

Apr 20 2014 7:56 PM | Updated on Aug 14 2018 5:54 PM

రాజంపేట నియోజకవర్గంలోని వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి.

కడప: రాజంపేట నియోజకవర్గంలోని వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న మల్లిఖార్జున రెడ్డిపై తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. స్థానికంగా  ఉంటూ  ఎప్పుట్నుంచో పార్టీ కోసం కృషి చేస్తున్న తమను పట్టించుకోవడం లేదంటూ నందలూరు తెలుగుతమ్ముళ్లు తిరుగుబాటుకు సిద్ధమైయ్యారు.  బ్రహ్మయ్య వర్గీయులను ప్రక్కకు పెట్టిన మల్లిఖార్జున రెడ్డి  వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. కొత్తగా పార్టీలో చేరిన వారికే బాబు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీలో చోటు చేసుకుంటున్న విభేదాలతో పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement