కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గొప్పా.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గొప్పా..? తెలంగాణ ప్రజలే తేల్చుకోవాలని టీ కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు
తేల్చుకోవాలని తెలంగాణ ప్రజలకు టీ కాంగ్రెస్ ఎంపీల పిలుపు
హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గొప్పా.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గొప్పా..? తెలంగాణ ప్రజలే తేల్చుకోవాలని టీ కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. సోమవారం ఎంపీ వివేక్ నివాసంలో ఎంపీలు మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అరవింద్రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రావు సమావేశమయ్యారు.
అనంతరం ఆయా నేతలతో కలిసి మధుయాష్కీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇచ్చిన మాట కోసం సీమాంధ్రలో పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా.. అధికారం కోసం ఏ గడ్డి అయినా తినే పార్టీ టీఆర్ఎస్.. గుడి దగ్గర దక్షిణ తీసుకుని పూజలు చేసే పూజారి కేసీఆర్. వీరిలో ఎవరు గొప్పో ప్రజలే తేల్చుకోవాలి’’ అన్నారు.