7 రాష్ట్రాలు, 2 యూటీలలోని 89 స్థానాల్లో ప్రశాంతంగా ఓటింగ్
పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 81.35 శాతం పోలింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుధవారం జరిగిన ఏడో విడత సార్వత్రిక ఎన్నికల్లో ఒక మోస్తరు నుంచి భారీ పోలింగ్ నమోదైంది. ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 89 లోక్సభ స్థానాల్లో పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్లో 9 స్థానాలకు అత్యధికంగా 81.35 శాతం పోలింగ్ నమోదవగా పంజాబ్లోని 13 స్థానాలకు ఒకే దశలో జరిగిన పోలింగ్లో ఆ రాష్ట్ర చరిత్రలోకెల్లా తొలిసారిగా 73 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే గుజరాత్లోని మొత్తం 26 స్థానాలకు ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ రికార్డయింది. 2009 లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లో కేవలం 47.92 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో ఉన్న 17 లోక్సభ స్థానాలతోపాటు 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదవగా ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలకు 57.10 శాతం, బీహార్లోని ఏడు స్థానాలకు 60 శాతం నమోదైంది. అలాగే జమ్మూకాశ్మీర్లో ఒక స్థానానికి 25.62 శాతం, కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలీ, డామన్ డయూలలో ఒక్కో స్థానానికి వరుసగా 85 శాతం, 76 శాతం పోలింగ్ నమోదైంది. పంజాబ్లోని మోగా, ఖదూర్ సాహిబ్, అమృత్సర్ స్థానాల పరిధిలో అకాలీదళ్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 15 మంది గాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేసిన యూపీలోని రాయ్బరేలీ స్థానంలో 51.85 శాతం ఓటింగ్ రికార్డయింది. అలాగే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేసిన గుజరాత్లోని వడోదరా స్థానంలో 70 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటేసిన మోడీ భార్య, తల్లి
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ భార్య యశోదాబెన్, ఆయన మాతృమూర్తి హిరాబా మోడీలు బుధవారం జరిగిన ఏడో విడత సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెహ్సనా జిల్లాలోని ఉంఝా నగరంలో ఉన్న కోట్ కువా ప్రాంతంలో యశోదాబెన్ ఓటు వేశారు. అనంతరం మీడియా ప్రశ్నలకు ఏమాత్రమూ స్పందించకుండానే ఆమె హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదేవిధంగా మోడీ తల్లి హిరాబా గుజరాత్లోని గాంధీనగర్లో ఎన్నికల కేంద్రానికి ఆటోలో వచ్చి ఓటు వేశారు. గాంధీనగర్ నుంచి బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ తలపడుతున్న విషయం తెలిసిందే.
ఈ ఎన్నికలు గుర్తుండిపోతాయి: అద్వానీ
భారత్లో ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల కంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బాగా గుర్తుండిపోతాయని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ చెప్పారు. బుధవారం కుమారుడు జయంత్, కుమార్తె ప్రతిభా అద్వానీలతో కలిసి గుజరాత్లోని అహ్మదాబాద్ వెస్ట్ నియోజకవర్గంలో ఓటేసిన అనంతరం అద్వానీ విలేకరులతో మాట్లాడారు. ‘నేను 1947 నుంచి అన్ని ఎన్నికలను చూశాను. దేశంలో 1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికలను చూశాను. అయితే దేశ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బాగా గుర్తుండిపోతాయి’ అని చెప్పారు. నిర్బంధ ఓటింగ్ విధానాన్ని అమలుచేయాలని పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల కమిషన్ విజయవంతమైతే ఎంతగానో సంతోషిస్తానని చెప్పారు. అయితే, తన పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశాలపై ప్రశ్నించగా, అద్వానీ దాటవేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడతానని, రాజకీయాలు మాట్లాడనని పేర్కొన్నారు.
‘ఏడు’లోనూ భారీ పోలింగ్
Published Thu, May 1 2014 2:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement