రాష్ట్రంలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. నాయకులు ఎవరైనా ఎన్నికల ప్రచారానికి వస్తే, వాళ్లను అడ్డుకోవాలని తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. నాయకులు ఎవరైనా ఎన్నికల ప్రచారానికి వస్తే, వాళ్లను అడ్డుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ) స్పెష్ల జోన్ కమిటీ ప్రతినిధి దయా పేరున పోస్టర్లు వెలిశాయి.
ఇప్పటికే ఛత్తీస్గఢ్లో ఎన్నికల కోసం వెళ్తున్న భద్రతా బలగాల మీద మావోయిస్టులు దాడులు చేసి ఒకే సంఘటనలో 15 మందిని హతమార్చడం, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు, కేంద్ర బలగాలు అప్రమత్తమయ్యాయి.