'రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలి' | ysrcp leaders padayatra in nellore district | Sakshi
Sakshi News home page

'రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలి'

Sep 24 2016 12:07 PM | Updated on Sep 4 2017 2:48 PM

రామాయపట్నం పోర్టును ఏర్పాటు చేయాలని ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నెల్లూరు : దుగ్గరాజుపట్నం పోర్టుతోపాటు రామాయపట్నం పోర్టును కూడా ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని రామాయపట్నంలో పోర్టుతోపాటు షిప్ యార్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్ర నిర్వహించారు.

కావలి నుంచి రామాయపట్నం వరకు సాగిన ఈ పాదయాత్రలో ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్రెడ్డి, రాంరెడ్డి ప్రతాప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్రెడ్డి, విష్ణువర్థన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement