యువకుడి ఆత్మహత్య | Youth suicide | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Dec 5 2016 11:29 PM | Updated on Nov 6 2018 7:56 PM

యువకుడి ఆత్మహత్య - Sakshi

యువకుడి ఆత్మహత్య

పోలీసు కేసు భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కథనం మేరకు.. ఇగుడూరుకు చెందిన నాగేంద్ర (25), అశ్వని దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

తాడిపత్రి రూరల్‌ : పోలీసు కేసు భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కథనం మేరకు.. ఇగుడూరుకు చెందిన నాగేంద్ర (25), అశ్వని దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. నాగేంద్ర బండల ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతను గ్రామంలోని పల్లె నారాయణప్ప భార్య అంగడి రామసుబ్బమ్మ సెల్‌ఫోన్‌ తీసుకున్నాడు. ఆమె గొడవపడటంతో సెల్‌ఫోన్‌ తిరిగి ఇచ్చేశాడు. సిమ్‌, మెమొరీ కార్డులు లేకుండా ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రామసుబ్బమ్మ హెచ్చరించింది. కేసు పెడుతుందేమోనని భయపడిపోయిన నాగేంద్ర సోమవారం కోమలి గ్రామ సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గ్రామస్తులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు భార్య అశ్వని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement