అనంతపల్లి(నల్లజర్ల) : నల్లజర్ల మండలం అనంతపల్లిలో తాడిపూడి అండర్టన్నెల్ వద్ద ఒక యువకుడు కాలువలో గల్లంతైనట్టు తెలుస్తోంది.
ఎర్రకాలువలో యువకుడి గల్లంతు ?
Nov 1 2016 2:27 AM | Updated on Sep 4 2017 6:48 PM
అనంతపల్లి(నల్లజర్ల) : నల్లజర్ల మండలం అనంతపల్లిలో తాడిపూడి అండర్టన్నెల్ వద్ద ఒక యువకుడు కాలువలో గల్లంతైనట్టు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. గుండేపల్లి గ్రామానికి చెందిన ముసలయ్యకు ముగ్గురు కొడుకులు. ఆఖరి కొడుకు తిరువీధుల రవికుమార్ (18) సోమవారం ఉదయం ఇంట్లో గొడవపడి బయటకు వచ్చేశాడు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తల్లి బేబికి ఫో¯ŒS చేసి తాను ఎర్రకాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. దీంతో గ్రామస్తులంతా ఘటనాస్థలానికి పరుగులు తీశారు. వారు వచ్చేసరికి రవికుమార్ చెప్పులు మాత్రమే కనిపించాయి. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది వచ్చి.. కాలువలో దూకిన ఆనవాళ్లు కనపడకపోవడంతో వెనుదిరిగారు. నిజంగా రవికుమార్ కాలువలో దూకాడా.. లేక ఇంట్లో వాళ్లను భయపెట్టడానికే ఇలా చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యం కేసు నమోదు చేసినట్టు అనంతపల్లి ఎస్ఐ ఐ.వెంకటేశ్వరరావు తెలిపారు. గ్రామస్తులు రవికుమార్ కోసం గాలిస్తున్నారు.
Advertisement
Advertisement