పిడుగు పడి మహిళ మృతి | Woman dies in lighting in anantapur | Sakshi
Sakshi News home page

పిడుగు పడి మహిళ మృతి

Oct 2 2015 5:06 PM | Updated on Jun 1 2018 8:39 PM

పిడుగు పడి మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

అనంతపురం : పిడుగు పడి మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా డి.ఇరెహాల్ మండలం వసగుడ్డం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ... గ్రామానికి చెందిన మహిళ నీలమ్మ (38) తోపాటు  ఇద్దరు కూలీలు వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్నారు.

ఆ సమయంలో భారీ వర్షం వచ్చింది. దీంతో కూలీలు చెట్ల కిందకు పరుగులు తీశారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో నీలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పొలంలోని కూలీలు వెంటనే స్పందించి క్షతగాత్రులను అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement