30 కంపెనీలతో ‘నన్నయ్య’ ఒప్పందం | with 30 companies "nanayaa' aggrement | Sakshi
Sakshi News home page

30 కంపెనీలతో ‘నన్నయ్య’ ఒప్పందం

Jul 26 2016 10:39 PM | Updated on Sep 4 2017 6:24 AM

పెనుగొండ : నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు, 30 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు రాజమండ్రి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాల నాయుడు తెలిపారు. పెనుగొండ ఎస్వీకేపీ అండ్‌ డాక్టర్‌ కేఎస్‌ రాజు ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు కళాశాలలో తెలుగు విభాగం సౌజన్యంతో ర్యాలీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘వచనా కవితా శతావధానం’ను ఆయన ప్

పెనుగొండ : నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు, 30 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు రాజమండ్రి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాల నాయుడు తెలిపారు. పెనుగొండ ఎస్వీకేపీ అండ్‌ డాక్టర్‌ కేఎస్‌ రాజు ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు కళాశాలలో తెలుగు విభాగం సౌజన్యంతో ర్యాలీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘వచనా కవితా శతావధానం’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిధిలో 450 కళాశాలలు, లక్ష మంది విద్యార్థులు ఉన్నారన్నారు. వీరికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విశేష కృషి చేస్తున్నట్టు చెప్పారు. చదువులో రసజ్ఞత, విచక్షణ అనే లక్షణాలు తప్పక చూడాలని అన్నారు.
విద్యార్థి ముందుగా తన వ్యక్తిత్వంలో, జీవితంలో ఉన్న లోపాలను, సమస్యలను గుర్తించాలన్నారు. వీటిని గుర్తించిన నాడు ప్రతి విద్యార్థి సమాజం ముందుకు అబ్దుల్‌ కలాం రూపంలో వస్తారన్నారు. వివేకానంద, ఆదిశంకరాచార్యులు వంటి వ్యక్తులు ప్రత్యక్ష గురువులుగా వెలుగులోకి వచ్చారన్నారు. సమాజంలో బాహ్య చీకటి, అంతర్గత చీకటి ఉంటాయని, బాహ్యచీకటిని విద్యుత్‌ వెలుగులతో తొలగిస్తే, అంతర్గ చీకటిని తొలగించే శక్తి సామర్థ్యాలు కేవలం గురువుకు మాత్రమే ఉన్నాయన్నారు. విద్యాలయాలకు భక్తితో వచ్చి క్రమశిక్షణతో కోర్సులు పూర్తిచేయాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేవీ నరశింహరాజు మాట్లాడుతూ వచన కవిత్వంలో శతావధాన ప్రక్రియకు నన్నయ్య విశ్వవిద్యాలయం తరువాత పెనుగొండ కళాశాల వేదిక కావడం గర్వంగా ఉందన్నారు. అనంతరం ర్యాలీ ప్రసాద్‌ వచన కవిత్వ శతావధానం అకట్టుకొంది. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు పితాని సూర్యనారాయణ, సెక్రటరీ, కరస్పాండెంట్‌ డాక్టర్‌ కలిదిండి రామచంద్రరాజు, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్, సంయుక్త కార్యదర్శులు సూర్నిడి రామ కోటేశ్వరరావు, పెన్మెత్స వెంకట సుబ్రహ్యణ్యం రాజు, ఉపాధ్యక్షుడు తాడి నాగిరెడ్డి పాల్గొన్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement