మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు కృషి | try to controlled mother, child deaths | Sakshi
Sakshi News home page

మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు కృషి

Jul 26 2016 6:10 PM | Updated on Sep 4 2017 6:24 AM

మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు కృషి

మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు కృషి

ఏలూరు అర్బన్‌: జిల్లాలో మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖలోని అన్ని స్థాయిల ఉద్యోగులు, సిబ్బంది సమష్టి కృషిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌. కె.కోటేశ్వరి అన్నారు.

ఏలూరు అర్బన్‌: జిల్లాలో మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖలోని అన్ని స్థాయిల ఉద్యోగులు, సిబ్బంది సమష్టి కృషిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌. కె.కోటేశ్వరి అన్నారు. స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం మల్టీపర్పస్‌ హెల్త్‌ ఎక్స్‌టñ న్షన్‌ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మాతా, శిశుమరణాలను పూర్తిగా నిరోధించే యోచనతో కేంద్రం ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత అభియాన్‌ పేరిట నూతన కార్యక్రమం అమలు చేస్తుందన్నారు.
అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పథకాలను అమలు చేస్తుందన్నారు. ఏఎన్‌ఎం స్థాయి నుంచి అన్ని స్థాయిల వారు తమ ప్రాంత గ్రామాల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ, సురక్షిత ప్రసవాలు ఎక్కువ సంఖ్యలో జరిగేలా ప్రజలను చైతన్యపరచాలని కోరారు. గర్భిణులకు పూర్తిస్థాయి వైద్య సేవలందించాలని, హైరిస్క్‌ గుర్తించిన సమయాల్లో వారిని అన్ని వసతులు గల ఆస్పత్రుల్లో చేర్పించాలన్నారు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో పి.ఉమాదేవి, జబార్, డాక్టర్, రోషన్‌మియా, డాక్టర్, రాథోడ్, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కన్సల్‌టెంట్, డాక్టర్, మిస్బా, డెమో చదలవాడ నాగేశ్వరరావు  పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement