ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌ | two inter state thiefs arrest | Sakshi
Sakshi News home page

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

Aug 11 2016 11:19 PM | Updated on Sep 4 2017 8:52 AM

వరంగల్‌ : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను సిటీ సీసీఎస్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు సీపీ సుధీర్‌కుమార్‌ తెలిపారు.

వరంగల్‌ : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను సిటీ సీసీఎస్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు సీపీ సుధీర్‌కుమార్‌ తెలిపారు. వారి నుంచి రూ.2.23 లక్షల విలువ చేసే 82.250 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల వివరాలను సీసీఎస్‌ సీఐ శ్రీధర్‌ వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన షేక్‌ ఇమ్రాన్, మహా రాష్ట్ర హింగన్‌ఘాట్‌ గోమాజీగూడకు చెం దిన సయ్యద్‌ అక్బర్‌ దగ్గరి బంధువులు కావడంతో వంట పనులు చేసుకుంటూ విజయవాడలో జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన ఇద్దరు 2013లో తొలిసారి చోరీకి పాల్పడ్డారు. మళ్లీ 2015లో ఖమ్మం టూ టౌన్‌ పరిధిలో దొంగతనానికి పాల్పడడం తో పోలీసులకు చిక్కి షేక్‌ఇమ్రాన్‌ జై లు పాలయ్యాడు.
ఈ ఏడాది జైలు నుంచి విడుదలైన ఇమ్రాన్‌ మళ్లీ అక్బర్‌తో కలసి వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో రెండు దొంగతనాలకు పాల్పడ్డాడు. జనవరిలో హైదరాబాద్‌ కు వెళుతున్న మహిళ నుంచి 55 గ్రాముల బంగారు నగలు, జులైలో వర్ధన్నపేట మం డలం కక్కిరాలపల్లిలో తాళం వేసిన ఇంటి నుంచి 27.250 గ్రాముల బంగారం అపహరించారు. చోరీ చేసిన ఆభరణాలను ఆమ్మేందుకు విజయవాడ నుంచి ఇద్దరు వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పక్కా సమాచారంతో అరెస్టు చేశామన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement