నేడు కాంట్రాక్టు లెక్చరర్ల రౌండ్‌ టేబుల్‌ సమావేశం | today contract lecturers meeting | Sakshi
Sakshi News home page

నేడు కాంట్రాక్టు లెక్చరర్ల రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Dec 26 2016 11:17 PM | Updated on Sep 4 2017 11:39 PM

కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో మంగళవారం రౌండు టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.పవ¯ŒS సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ భద్రత కోరుతూ 24 రోజులుగా వారు సమ్మె చేస్తున్నా

రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : 
కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో మంగళవారం రౌండు టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.పవ¯ŒS సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ భద్రత కోరుతూ 24 రోజులుగా వారు సమ్మె చేస్తున్నా ప్రభుత్వ స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ కారణంగా వారు ఆందోళన చేస్తున్న శిబిరం వద్దనే ఉదయం 11 గంటలకు ఈ రౌండు టేబుల్‌ సమావేశం జరుగనుందన్నారు. విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరు కావాలన్నారు. నిద్దరోతున్నప్రభుత్వాన్ని మేల్కొపడంతోపాటు కాంట్రాక్టు లెక్చరర్ల సమస్య పరిష్కారించడం ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement