క్రిష్ణగిరిలో సోమవారం రాత్రి వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను స్థానికులు క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కందికుప్పం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అదే విధంగా డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని నాగిరెడ్డిపాళ్యం గ్రామానికి చెందిన రుద్రప్ప(70) తళి సమీపంలోని కురుంగలతూరు గ్రామంలో నివాసముంటున్న కొడుకును చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం మనవుడు శశికుమార్తో కలిసి ద్విచక్రవాహనంపై నాగిరెడ్డిపాళ్యానికి వస్తుండగా అగళకోట వద్ద వెనుక నుంచి వస్తున్న టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రుద్రప్ప, శశికుమార్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రుద్రప్ప మృతి చెందాడు. ఘటనపై తళి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.