ప్రతి రైతుకూ పంట బీమా అందే వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని.. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు.
ప్రతి రైతుకూ పంట బీమా అందే వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని.. కమలాపురం ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ నేత రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. కమలాపురం పరిధిలో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన కొంత మంది రైతులకు 2012 సంవత్సరానికి గానూ పంట బీమా అందలేదు. దీంతో రైతులు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని కలిసి విషయం వివరించారు.
	ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకూ పంట బీమా వచ్చేంతవరకూ పోరాడతామన్నారు. వీలైతే హైదరాబాద్లోని ఇన్సూరెన్స్ కంపెనీ ఎదుట వంటావార్పు కార్యక్రమం చేసి ధర్నా నిర్వహిస్తామన్నారు.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
