ఏజెన్సీ పరిధిలోని మంగపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెంది న పుట్ట మల్లిక(30) మలేరియా జ్వరంతో గురువారం మృతి చెందింది.
మలేరియా జ్వరంతో మహిళ మృతి
Jul 21 2016 11:47 PM | Updated on Sep 4 2017 5:41 AM
మంగపేట : ఏజెన్సీ పరిధిలోని మంగపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెంది న పుట్ట మల్లిక(30) మలేరియా జ్వరంతో గురువారం మృతి చెందింది.
నాలుగు రోజు లుగా మల్లికకు జ్వరం వస్తుండంతో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో చూపించగా వైద్యులు మలేరియా జ్వరంగా గుర్తించి మందులు అందించి ఇంటికి పంపించారు. మళ్లీ జ్వరం తీవ్రం కావడంతో ఏటూరునాగారం ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొం దుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Advertisement
Advertisement