గంగజాతర కార్యక్రమంలో బళ్లారి డ్రమ్స్ కారణంగా ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి.
–ఇరువర్గాల ఘర్షణ
–తొమ్మిది మందికి గాయాలు
మదనపల్లె సిటీ : గంగజాతర కార్యక్రమంలో బళ్లారి డ్రమ్స్ కారణంగా ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. పట్టణ శివార్లలోని నెమలినగర్ వడ్డిపల్లెలో గంగజాతర నిర్వహించారు. ఈ జాతరలో బళ్లారి డ్రమ్స్ను ఓ వర్గం ఏర్పాటు చేసింది. అయితే తమ వర్గానికి ఇవ్వలేదంటూ మరో వర్గం ఘర్షణ పడింది. ఆ సమయంలో పెద్దలు రాజీ చేశారు. దీనిపై గురువారం పెద్దలు పంచా యితీ చేస్తుండగా ఒకరిపై మరొకరు ఆరోపణ లు చేసుకుంటూ పరస్పరం కర్రలతో దాడికి పాల్పడ్డారు.
ఓ వర్గానికి చెందిన రెడ్డిశేఖర్ (19) , రెడ్డికుమార్ (50), రెడ్డి(33), మరో వర్గానికి చెందిన గోపాల్(52), సోమశేఖర్ (24), చలపతి(23), రామస్వామి(33), రెడ్డిప్రసాద్(24), మణి(30) గాయపడ్డా రు. వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వన్ టౌన్ ఎస్ఐ సుకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


