నేడు షర్మిల రెండోరోజు పరామర్శయాత్ర | sharmila 2nd day paramarsha yatra in medak | Sakshi
Sakshi News home page

నేడు షర్మిల రెండోరోజు పరామర్శయాత్ర

Jan 4 2016 8:52 AM | Updated on Oct 16 2018 3:12 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల.. మెదక్ జిల్లాలో పరామర్శయాత్రలో భాగంగా రెండో రోజు సోమవారం పర్యటించనున్నారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల.. మెదక్ జిల్లాలో పరామర్శయాత్రలో భాగంగా రెండో రోజు సోమవారం పర్యటించనున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబసభ్యులను పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు.

మెదక్ జిల్లా పర్యటనలో తొలిరోజు ఆదివారం షర్మిల మూడు నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను పరామర్శించారు. సోమ, మంగళవారాల్లో మెదక్ జిల్లాలో మరో ఆరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. షర్మిల వెంట వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులు ఉంటారు.

Advertisement
 
Advertisement
Advertisement