కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధించాలి | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధించాలి

Published Fri, Aug 12 2016 12:57 AM

కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధించాలి

 
నెల్లూరు సిటీ: కెరీర్‌ ఫౌండేషన్‌ కోర్సుల్లో చేరి కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థులు ఫలితాలను సాధించాలని మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు. వెంగళరావునగర్‌లోని నగరపాలక ఉన్నత పాఠశాలను గురువారం పరిశీలించారు. త్రిపుల్‌ ఐటీకి పాఠశాల నుంచి ఎంపికైన విద్యార్థి భానుప్రసాద్‌కు రూ.ఐదు వేలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 415 మంది విద్యార్థులకు గానూ 13 మందే ఉపాధ్యాయులు ఉన్నారని, త్వరలో విద్యావలంటీర్లను నియమించనున్నట్లు చెప్పారు. కార్పొరేటర్లు పెంచలనాయుడు, రాజానాయుడు, పిట్టి సత్యనాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement