ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి | school boy dead in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి

May 21 2016 11:55 AM | Updated on Jul 12 2019 3:02 PM

రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు.

వెంకటాపురం: ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అబ్బాయిగూడెం వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో బాలుడు చనిపోయాడు. వివరాలివీ... చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామానికి చెందిన కొప్పుల సతీష్, రాణి దంపతుల కుమారుడు సాయిచరణ్(9) అబ్బాయిగూడెంలో బంధువుల ఇంటికి వచ్చాడు. అతడు శనివారం ఉదయం రోడ్డు పక్కన ఆడుకుంటుండగా భద్రాచలం నుంచి వాజేడు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సాయిచరణ్‌ను 108 వాహనంలో వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బాలుడు చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement