ప్రొద్దుటూరు కల్చరల్: ప్రొద్దుటూరులో దేవీశరన్నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా మంగళవారం అమ్మవారి శమీదర్శన మహోత్సవం నిర్వహించనున్నారు. దసరా మహోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది వాసవీమాత శమీదర్శనం, తొట్టిమెరవణి. ఈ ఉత్సవాలను ఏటా 3 లక్షల మందికిపైగా భక్తులు తిలకిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 2.56 గంటల్లోపు మకరలగ్నంలో శమీదర్శనం ప్రారంభం కానుంది. పుర వీధుల మీదుగా అమ్మవారి శమీదర్శన మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమై కొర్రపాడు రోడ్డులోని శ్రీవాసవీ శమీదర్శన మండపం చేరనుంది. విజయానికి, సంపదకు చిహ్నమైన శమీ వృక్షాన్ని దర్శించి అమ్మవారికి పూజలు నిర్వహిస్తే శుభప్రదమని ప్రతీతి. అందువల్లనే విజయదశమి నాడు అమ్మవారికి శమీదర్శనం చేయించి తమకు విజయాలు, సిరిసంపదలు ఇవ్వాలని వేడుకుంటారు. శ్రీమహాలక్ష్మి సమేత చెన్నకేశవస్వామి, రతనాల వేంకటేశ్వరుడు, శివాలయం, రాజరాజేశ్వరి దేవి ఆలయాలతోపాటు పట్టణంలోని అన్ని ఆలయాల నిర్వాహకులు కొర్రపాడు రోడ్డు మిల్లులలోని శమీవృక్ష దర్శనానికి వివిధ కళాబృందాల మధ్య వైభవంగా చేరుకుంటారు. అన్ని ఆలయాల నుంచి వచ్చిన స్వామి, అమ్మవారి వైభవాన్ని తిలకించేదుకు వచ్చిన భక్తులతో కొర్రపాడు రోడ్డు భక్త సంద్రం కానుంది.
విజయలక్ష్మిదేవి గ్రామోత్సవం (తొట్టిమెరవణి):
శ్రీవాసవీకన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారికి అర్ధరాత్రి 12.15 గంటల నుంచి 1 గంటల లోపు మిథునలగ్నంలో నిర్వహించే తొట్టిమెరవణి ప్రారంభం కానుంది. పంచలోహంతో తయారు చేసిన తొట్టి మెరవణి రథంలో అమ్మవారి శ్రీ చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ రథం పర్యటించిన ప్రాంతంలో అశుభాలు, చెడులు తొలగిపోయి సర్వశుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తారు. పురవీధులలో కన్నుల పండువగా తొట్టిమెరవణిని నిర్వహిస్తారు. అమ్మవారిశాల నుంచి బయలుదేరి మెయిన్ బజారు, పప్పులబజారు మీదుగా పుట్టపర్తి సర్కిల్కు చేరుకుంటారు. కళ్లుమిరుమిట్లు గొలిపే బాణసంచా పేలుళ్లు, వెలుగులతో ఆ ప్రాంతం నూతన శోభ సంతరించుకోనుంది. ఈ తొట్టి మెరవనిలో శమీదర్శనంలోని కళాబృందాలతోపాటు సినీడూప్స్, బ్యాండ్ మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు రామ్మోహన్రావు తెలిపారు. ఉత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
నేడు శమీ దర్శనం
Published Tue, Oct 11 2016 1:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement