రూ.5 లక్షల విలువైన కోళ్లు ఎత్తుకెళ్లారు | Rs.5 lakhs worth hens robbery in nalgonda district | Sakshi
Sakshi News home page

రూ.5 లక్షల విలువైన కోళ్లు ఎత్తుకెళ్లారు

Jul 30 2016 9:42 AM | Updated on Sep 4 2017 7:04 AM

రూ.5 లక్షల విలువైన కోళ్లు ఎత్తుకెళ్లారు

రూ.5 లక్షల విలువైన కోళ్లు ఎత్తుకెళ్లారు

నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం శివారులో శనివారం వేగంగా వెళ్తున్న కోళ్ల వ్యాను ఎదురుగా వస్తున్న పాల వ్యానును ఢీకొట్టింది.

నల్గొండ : నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం శివారులో శనివారం వేగంగా వెళ్తున్న కోళ్ల వ్యాను ఎదురుగా వస్తున్న పాల వ్యానును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యాను డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే కోళ్ల వ్యానులో ఉన్న దాదాపు 1500 కోళ్లను స్థానికులు తమ వెంట తీసుకుని ఎత్తుకెళ్లారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాల వ్యానును సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న కోళ్ల వ్యాన్ ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement