దొంగల అరెస్ట్ : వజ్రాలు స్వాధీనం | Rs. 20 lakhs worths diamonds seized in thieves | Sakshi
Sakshi News home page

దొంగల అరెస్ట్ : వజ్రాలు స్వాధీనం

Aug 13 2015 12:55 PM | Updated on Aug 28 2018 7:30 PM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులు ముగ్గురు దొంగలను గురువారం అదుపులోకి తీసుకున్నారు.

భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులు ముగ్గురు దొంగలను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి అత్యంత విలువైన నగలు, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.  ఆ తర్వాత   డీఎస్పీ స్వర్ణలత విలేకర్ల సమావేశంలో దొంగల వివరాలను తెలిపారు. పట్టుబడిన ముగ్గురు దొంగలు రాకేష్, కృష్ణ, కరుణలు పేరు మోసిన దొంగలని విశదీకరించారు. స్వాధీనం చేసుకున్న నగలు రూ. 20 లక్షల వరకు ఉంటాయని ఆమె తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement