‘రాజధాని’ ఏసీ కోచ్‌ బస్‌ ప్రారంభం | Rajadhani A.C coach start | Sakshi
Sakshi News home page

‘రాజధాని’ ఏసీ కోచ్‌ బస్‌ ప్రారంభం

Sep 29 2016 10:25 PM | Updated on Nov 6 2018 4:04 PM

సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు మంజూరైనా ‘రాజధాని’ ఏసీ కోచ్‌ బస్‌ను గురువారం ప్రారంభించారు. సిరిసిల్ల నుంచి సికింద్రాబాద్‌ వరకు నిత్యం హైదరాబాద్‌కు బస్సు ట్రిప్పులను ప్రారంభించినట్లు ఆర్టీసీ డీఎం వెంకటరమణ తెలిపారు.

 సిరిసిల్ల:  సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు మంజూరైనా ‘రాజధాని’ ఏసీ కోచ్‌ బస్‌ను గురువారం ప్రారంభించారు. సిరిసిల్ల నుంచి సికింద్రాబాద్‌ వరకు నిత్యం హైదరాబాద్‌కు బస్సు ట్రిప్పులను ప్రారంభించినట్లు ఆర్టీసీ డీఎం వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చొరవతో ఈ బస్సు మంజూరైనట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సామల పావని, ‘సెస్‌’ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ జిందం చక్రపాణి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తవుటు కనకయ్య, ‘సెస్‌’ వైస్‌ చైర్మన్‌ లగిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్‌ గడ్డం లత, జాగృతి జిల్లా కో కన్వీనర్‌ జూపల్లి నాగేందర్‌రావు, ఆర్టీసీ యూనియన్‌ నాయకులు జీ.పి.సింగ్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.  
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement