పుష్కర ఏర్పాట్లు త్వరగా పూర్తి కావాలి | Pushkara arrangements speedup | Sakshi
Sakshi News home page

పుష్కర ఏర్పాట్లు త్వరగా పూర్తి కావాలి

Aug 4 2016 10:22 PM | Updated on Sep 4 2017 7:50 AM

పుష్కర ఏర్పాట్లు త్వరగా పూర్తి కావాలి

పుష్కర ఏర్పాట్లు త్వరగా పూర్తి కావాలి

పుష్కరాలకు సమయం సమీపిస్తున్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు త్వరగా పూర్తి కావాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.ఎస్‌.వి.ప్రసాద్‌ ఆలయ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : పుష్కరాలకు సమయం సమీపిస్తున్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా  ఏర్పాట్లు త్వరగా పూర్తి కావాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.ఎస్‌.వి.ప్రసాద్‌ ఆలయ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.ఎస్‌.వి.ప్రసాద్‌ గురువారం దుర్గగుడిపై ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత టోల్‌గేటు వద్దకు చేరుకున్న ఆయన ఘాట్‌ రోడ్డులో జరుగుతున్న గ్రీనరీ పనులను పరిశీలించారు. ఘాట్‌ రోడ్డు మీదగా కొండపైకి చేరుకుని క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలించారు.  పుష్కరాల్లో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో సూర్యకుమారిని ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన భద్రతా చర్యల గురించి పోలీసు అధికారులతో చర్చించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement