కన్నబిడ్డ జ్ఞాపకాలు పదిలంగా.. పవిత్రంగా | parents install son statue in madiki village | Sakshi
Sakshi News home page

కన్నబిడ్డ జ్ఞాపకాలు పదిలంగా.. పవిత్రంగా

Dec 30 2015 12:48 PM | Updated on Sep 3 2017 2:49 PM

రాంబాబు దంపతులు కట్టించిన గుడిలో నరేష్ విగ్రహం. (ఇన్‌సెట్‌లో) తండ్రి రాంబాబు

రాంబాబు దంపతులు కట్టించిన గుడిలో నరేష్ విగ్రహం. (ఇన్‌సెట్‌లో) తండ్రి రాంబాబు

కన్నబిడ్డలకు చిన్నగాయమైతేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటి బిడ్డలు చిన్నవయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోతే..

కన్నబిడ్డలకు చిన్నగాయమైతేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటి బిడ్డలు చిన్నవయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోతే.. ఇక ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అలాంటి బాధనే తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన అత్తిలి రాంబాబు, వీవ వెంకట సత్యవేణి దంపతులు ఎదుర్కొన్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు.
 

గతేడాది పెద్దకుమారుడు నరేశ్ తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడు. ‘మా ఆయుష్షు కూడా పోసుకుని బతుకు నాయనా’ అని ఆ తల్లిదండ్రులు పడిన ఆర్తికి ప్రతిఫలం లేకుండాపోయింది. పన్నెండేళ్ల వయసులోనే నరేశ్ తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. తమ ముద్దుల కుమారుడి అకాల మరణం ఆ తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేసింది.

తమ జ్ఞాపకాల్లో కన్నబిడ్డను చూసుకోవడం కాకుండా.. కన్నబిడ్డ స్మృత్యర్థం ఏదైనా ఉండాలనుకున్నారు. ఓ గుడి కట్టి తమ కుమారుడి జ్ఞాపకాలను తమ గుండెల్లో పదిలంగా ఉంచుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తమ ఊరికి సమీపంలోని బడుగువానిలంక గ్రామంలో ఉన్న తమ వ్యవసాయ భూమిలోని ఐదు సెంట్లలో ఆరు నెలల కిందట ఓ గుడి కట్టించి, నరేశ్ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement