స్కూల్ ఫీజులు పెంచడానికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
డాన్బాస్కో స్కూల్ ఎదుట ఆందోళన
Jul 23 2016 2:53 PM | Updated on Sep 15 2018 5:39 PM
హైదరాబాద్: స్కూల్ ఫీజులు పెంచడానికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. నగరంలోని ఎర్రగడ్డ మోతీనగర్ డాన్బాస్కో స్కూల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహించిన తల్లిదండ్రులు శనివారం ధర్నా చేశారు. అడ్మిషన్లు తీసుకునే సమయంలో తక్కువ ఫీజులు చెప్పి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని, పాఠశాల యాజమాన్యం పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడుతున్నారు.
Advertisement
Advertisement