సీఎం చిత్రపటానికి పాలాభిషేకం | palabhishekam to CM KCR photo | Sakshi
Sakshi News home page

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

Aug 25 2016 11:13 PM | Updated on Aug 14 2018 10:59 AM

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం - Sakshi

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు మహారాష్ర్టతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందంతో పాటు జిల్లాల పునర్విభజనకు కృషి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మండలంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

శామీర్‌పేట్‌: కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు మహారాష్ర్టతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందంతో పాటు జిల్లాల పునర్విభజనకు కృషి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మండలంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం శామీర్‌పేట్‌ కట్టమైసమ్మ దేవాలయం వద్ద కేసీఆర్‌ చిత్రపటానికి శామీర్‌పేట్‌ సర్పంచి బత్తుల కిశోర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు మహారాష్ర్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చరిత్రలో ఓ మైలు రాయి అన్నారు. ప్రాజెక్టుల ఒప్పందం ద్వారా మల్లన్నసాగర్‌ ద్వారా మేడ్చల్‌ నియోజకవర్గంలోని శామీర్‌పేట్‌ పెద్ద చెరువుకు నీళ్లు వస్తాయన్నారు. దీంతో రైతుల పంట పొలాలకు నీరు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్‌ ఉప సర్పంచ్‌ కంటం క్రిష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు డి.బి. వెంకటేశ్‌, ఆనంద్‌గౌడ్‌, నాయకులు విష్ణు, గన్నారెడ్డి, మైసయ్య, నారాయణ, శ్రీనివాస్‌, నర్సింహారెడ్డి, వెంకటేశ్, రాములు, రమేశ్‌, అంజనేయులు సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement