రవాణా శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాహనాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది.
15 నుంచి రవాణా శాఖలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్
Oct 13 2016 12:56 AM | Updated on Sep 4 2017 5:00 PM
– నేటి నుంచి వాహన డీలర్లకు అవగాహన కార్యక్రమాలు
కర్నూలు: రవాణా శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాహనాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. ఈనెల 15న కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు జిల్లా రవాణా శాఖ యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఇందుకు సంబంధించి వాహన డీలర్లు, సిబ్బందికి స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 13, 14వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశం వాహన డీలర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ ఉపకమిషనర్ బి.ప్రమీల విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement