చికిత్సపొందుతూ వ్యక్తి మృతి | one person died | Sakshi
Sakshi News home page

చికిత్సపొందుతూ వ్యక్తి మృతి

Aug 30 2016 12:33 AM | Updated on Nov 6 2018 8:04 PM

అప్పుల బాధ తాళలేక ఓ వ్యకి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ సం ఘటన మండలంలోని ఓగ్లాపూర్‌లో చోటుచేసుకుంది. ఒగ్లాపూర్‌కు చెంది న బిజిలి బాబు(25) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఆత్మకూరు : అప్పుల బాధ తాళలేక ఓ వ్యకి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ సం ఘటన మండలంలోని ఓగ్లాపూర్‌లో చోటుచేసుకుంది. ఒగ్లాపూర్‌కు చెంది న బిజిలి బాబు(25) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాననే మనోవేదనతో శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడి కుటుంబ సభ్యులను సర్పంచ్‌ కనుకుంట్ల శారద, అభివృద్ధి కమిటీ చైర్మన్‌ జీవన్‌రావు పరామర్శించి, రూ.5వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement