ఎన్టీపీసీకి గ్రీన్టెక్ గోల్డ్ సేఫ్టీ అవార్డు
రామగుండం ఎన్టీపీసీకి గ్రీన్టెక్ గోల్డ్ సేఫ్టీ అవార్డు–2016 లభించింది. దేశంలోని థర్మల్ పవర్ స్టేషన్లలో రక్షణ సూత్రాలను పాటించడంలో ముందంజలో నిలవడంతో న్యూఢిల్లీకి చెందిన గ్రీన్టెక్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది.
జ్యోతినగర్ : రామగుండం ఎన్టీపీసీకి గ్రీన్టెక్ గోల్డ్ సేఫ్టీ అవార్డు–2016 లభించింది. దేశంలోని థర్మల్ పవర్ స్టేషన్లలో రక్షణ సూత్రాలను పాటించడంలో ముందంజలో నిలవడంతో న్యూఢిల్లీకి చెందిన గ్రీన్టెక్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది. ఈనెల 29న గోవాలో జరిగిన కార్యక్రమంలో గ్రీన్టెక్ ఫౌండేషన్ చైర్మన్ కమలేశ్వర్ శరన్, చీఫ్ అడ్వైజర్ ఆర్కే.దూబే చేతుల మీదుగా ప్రాజెక్టు జనరల్ మేనేజర్ యూకే.దాస్గుప్తా, అధికారులు నర్సింహరెడ్డి, గాంగేయుడు అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు రావడంపై రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ ఈడీ ప్రశాంత్కుమార్ మహాపాత్ర హర్షం ప్రకటించారు.