‘అనంత’లో తొలి డిజిటల్ బ్రాంచి ప్రారంభం
అనంతపురం అగ్రికల్చర్: అన్ని బ్యాంకుల కన్నా అత్యాధునిక సేవలు అందించడమే లక్ష్యంగా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్ ఇన్టచ్ బ్రాంచిని తొలిసారిగా ‘అనంత’లో ఏర్పాటు చేశామని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తిరుపతి డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) ఎం.బాలసుబ్రమణియన్ తెలిపారు. నగరంలోని సూర్యానగర్ మెయిన్రోడ్డులో ఏర్పాటు చేసిన డిజిటల్ బ్రాంచిని శుక్రవారం ఆర్ఎం ఎంవీఆర్ మురళీకృష్ణ, బ్రాంచి మేనేజర్ ఎస్వీ ప్రసాద్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీఎం, ఆర్ఎం మాట్లాడుతూ ఇక్కడ నగదు, పేపరు, మనషులతో పనిలేకుండా ఆధునిక యంత్రపరికరాలు, కంప్యూటర్లతోనే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చన్నారు. కైవేసీ ఫారాలు ఉంటే ఖాతాదారులు స్వంతంగానే కొత్తగా ఖాతాలు తెరవడం, ఏటీఎం కార్డులు పొందడం, చెక్బుక్కులు తీసుకోవడం, లావాదేవీలు జరపడం, నెట్ బ్యాంకింగ్, స్వయం సేవా మిషన్ ద్వారా పాస్బుక్కులో వివరాలు నమోదు చేసుకోవడం లాంటివి సులభంగా చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. హౌసింగ్, వెహికల్ లోన్లు కూడా తీసుకోవచ్చన్నారు. డిజిటల్ ఇన్టచ్ బ్రాంచి 24 గంటలూ పని చేస్తుందన్నారు.
ఈ అవకాశాన్ని ఖాతాదారులు అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఖాతాదారుల స్పందనను బట్టి భవిష్యత్తులో ధర్మవరం, హిందూపురం, కదిరి పట్టణాల్లో కూడా ఇలాంటి శాఖను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీఐ అధికారులు హరిబాబు, శ్రీకాంత్, విద్యాసాగర్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
అత్యాధునిక సేవల్లో ఎస్బీఐ
Published Fri, Aug 19 2016 11:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement