బెళుగుప్ప: కాలువపల్లి వద్ద ఈ నెల 22న జరిగిన హరిజన సోమశేఖర్ (25)దారుణ హత్య కేసులో ప్రదాన నిందితుడు హరిజన ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం బెళుగుప్ప పోలీస్స్టేషన్లో సీఐ శివప్రసాద్, ఎస్ఐ నాగస్వామిలు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీఐ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వరుసకు అక్క అయిన ఆంజనేయులు భార్య వరలక్ష్మితో సోమశేఖర్ మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. మందలించి, మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా మార్పు రాకపోవడంతో అతడిని కడతేర్చాలని ఆంజనేయులు పథకం వేశాడు.
సమీప బంధువులైన ఆత్మకూరుకు చెందిన హరిజన నాగరాజు, కాలువపల్లికి చెందిన హరిజన కిరణ్, హరిజన పెద్దన్నలతో కలసి ఈ నెల 22న సాయంత్రం గ్రామ సమీపంలోని ముళ్లపొదల వద్ద సోమశేఖర్పై మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. మంగళవారం సాయంత్రం రామసాగరం క్రాస్ వద్ద ప్రధాన నిందితుడు ఆంజనేయులును ఎస్ఐ నాగస్వామి తమ సిబ్బందితో కలసి అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని సీఐ శివప్రసాద్ తెలిపారు. ప్రధాన నిందితుడిని కళ్యాణదుర్గం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారన్నారు.
హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
Published Wed, Jul 26 2017 10:43 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
- Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
Advertisement