కర్నూలు(హాస్పిటల్): నాయకత్వ లక్షణాల్లో నేటి యువతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తి అని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యుడు శ్రీధర్రెడ్డి చెప్పారు. ఈ నెల 21న వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. నగరంలోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధిలో సొసైటీ చైర్మన్ జి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 50 మందికి పైగా యువకులు రక్తనిధికి చేరి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని కళాశాల విద్యార్థి వినోద్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రహదారులపై ఉన్న అనాథలకు దుప్పట్ల పంపిణీ, అనాథాశ్రమంలో అన్నదానం కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు. ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఓర్చుకునే సహనం, నాయకత్వ లక్షణాలు, పేదలను పలకరించే తీరు వైఎస్ జగన్కే సొంతమన్నారు. నేటి యూత్ ఐకాన్ జగన్ అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటయ్య, కో ఆర్డినేటర్ పద్మారెడ్డి, వైఎస్ జగన్ యూత్ నాయకులు వినోద్కుమార్రెడ్డి, విద్యార్థులు షాహిద్, షేక్షావలి, మహేష్గౌడ్, విజయసింహారెడ్డి పాల్గొన్నారు.
యువతకు వైఎస్ జగన్ స్ఫూర్తి
Published Tue, Dec 20 2016 10:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement