కొనసాగుతున్న జల విద్యుత్‌ తయారీ | hydro vidyut prepare in pabr dam | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న జల విద్యుత్‌ తయారీ

Jan 6 2017 12:14 AM | Updated on Sep 5 2017 12:30 AM

మండలంలోని పెన్నఅహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌ డ్యాం)లోని ఏపీ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో గత నెల 24 నుంచి విద్యుత్‌ తయారీ ప్రారంభించారు.

కూడేరు : మండలంలోని పెన్నఅహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌ డ్యాం)లోని ఏపీ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో గత నెల 24 నుంచి విద్యుత్‌ తయారీ ప్రారంభించారు. గురువారానికి మొత్తం రూ.10 లక్షల యూనిట్ల విద్యుత్‌ను తయారు చేసినట్లు ఏపీ జెన్‌కో డీఈ రఫి అహమ్మద్‌ తెలిపారు. ప్రస్తుతం ఒక టర్బయిన్‌లో మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు. విద్యుత్‌ ఉత్పత్తికి డ్యాం నుంచి రోజుకు సుమారు 700 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ తయారైన విద్యుత్‌ను అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్లే లైన్‌కు కలపనున్నట్టు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement