తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో అపోహలకు తావులేదని ఆ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు.
నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో అపోహలకు తావులేదని ఆ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్గొండలో విలేకర్లతో మాట్లాడుతూ... కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ ప్రాజెక్టులను గడువులోపు పూర్తి చేస్తామని చెప్పారు. 2018 చివరినాటికి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తామని మంత్రి జగదీశ్రెడ్డి వివరించారు.