‘ఫైనాన్స్’ దాడి కేసులో నిందితులకు బెయిల్.. అరెస్ట్
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : ఫైనాన్స్ కంపెనీలపై దాడుల కేసులో ప్రధాన నిందితుడు రాయుడు రాకేష్తో పాటు 18 మంది ఆదివారం విడుదల అయ్యారు. అయితే వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సమ
రెండు దాడులకు రెండు కేసులు
సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్తత
కుటుంబ సభ్యుల బైఠాయింపు
ఈ నెల 6న నగరంలోని రెండు ఫైనాన్స్ సంస్థలపై దాడి సంఘటనలపై అరెస్ట్ అయిన నిందితులు ఆదివారం బెయిల్పై విడుదలైన తరువాత వారిని పోలీసులు తిరిగి అరెస్ట్ చేయడంతో సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ దాడులపై రెండు కేసులు నమోదు చేశామని, ఒక కేసులో నిందితులు ఇంతవరకూ జైలులో ఉన్నారని, ఇప్పుడు మరో కేసులో వారిని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు సెంట్రల్ జైలు వద్ద పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. నిందితుల విడుదల సందర్భంగా వారికి సంఘీభావంగా అక్కడికి చేరుకున్న మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్.. ఈ పరిస్థితిపై ప్రభుత్వ వైఖరిని తూర్పారపట్టారు.
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : ఫైనాన్స్ కంపెనీలపై దాడుల కేసులో ప్రధాన నిందితుడు రాయుడు రాకేష్తో పాటు 18 మంది ఆదివారం విడుదల అయ్యారు. అయితే వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సమయంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి బస్సులో తరలిస్తుండగా నిందితుల కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వన్ టౌన్ పోలీస్స్టేషన్ నుంచి నిందితులను న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. తిరిగి జడ్జి రిమాండ్ విధించడంతో వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి తిరిగి సెంట్రల్ జైలుకు తరించారు. ఈ సమయంలో సెంట్రల్ జైలు వద్ద బాధితుల కుటుంబాలకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.సెంట్రల్ జైలు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులకు మోహరించారు.
హర్షకుమార్ ధ్వజం..
ఫైనాన్స్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. ఫైనాన్స్ కంపెనీలపై దాడులు చేసిన నిందితులు బెయిల్పై విడుదల అయిన సందర్భంగా వారికి సంఘీభావం తెలిపేందుకు ఆయన సెంట్రల్ జైలుకు వచ్చారు. అక్కడి పరిస్థితిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఒక వైపు కాల్మనీ కేసులపై ఫిర్యాదు చేయాలని చెబుతూనే మరో వైపు ఫిర్యాదు చేసిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. ఒకే రోజు రెండు చోట్ల జరిగిన సంఘటనలో ఒక కేసు పెట్టవచ్చునని ప్రభుత్వం ప్రమేయంతోనే ఈ రెండు కేసులు పెట్టారని ఆరోపించారు. ఇప్పటికే నిందితులు 22 రోజులు సెంట్రల్ జైలులో ఉన్నారని, దీంతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయని అన్నారు. ఇప్పటికైనా వారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.