–డీసీసీబీ డైరెక్టర్ ముత్తవరపు పాండురంగారావు
నల్లగొండ టౌన్ : రైతుల సంక్షేమమే ధ్యేయమని, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా ప్రస్తుత ఖరీఫ్లో కొత్త రైతులకు రూ.20కోట్ల స్వల్ప కాలిక రుణాలు ఇవ్వనున్నట్లు డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు తెలిపారు. బుధవారం స్థానిక డీసీసీబీలో జరిగిన బ్యాంక్ మహాజన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు పే రివిజన్ చెల్లించాలని నిర్ణయించామని, అన్ని రుణాలపై రుణ పథకానికి అనుగుణంగా వ్యక్తిగత లోన్ పరిమితి పెంచనున్నామన్నారు. ఇప్పటి వరకు దీర్ఘకాలిక రుణాలకు వాటా దారుడిగా వున్న రూ.10వేలను రూ.15వేలకు పెంచనున్నట్లు చెప్పారు. బ్యాంకు ద్వారా రైతులకు వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. రైతుల పిల్లల ఉన్నత విద్యకోసం కూడా రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. సహకార సంఘాల మౌలిక వసతుల కల్పనకు రూ.కోటి 3లక్షల 88 వేలను మంజూరు చేశామన్నారు. రుణమాఫీ ప్రకటించినందున జూన్ 2016 నాటికి స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు 91.55 శాతం వసూలు చేసినట్లు వివరించారు. రైతులకు వ్యక్తిగత బీమా కల్పించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార సంఘాల్లోని సభ్యులుగా ఉన్న రైతులు ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కారాల కోసం రూ.10వేల చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలో జిల్లా పరిధిలోని అన్ని బ్రాంచీలు, ఎన్నిక చేయబడిన సహకార సంఘాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నామన్నారు. అనంతరం ఎజెండాలోని అంశాలను చర్చించి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ కె.మదన్మోహన్, డైరెక్టర్లు ముదిరెడ్డి రమణారెడ్డి, హనుమయ్య, చిన్నపరెడ్డి నరేందర్రెడ్డి, పాశం సంపత్రెడ్డి, కోటేశ్వర్రావు, ఎస్. రవీందర్రెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాస్, ముత్యపురావు, ఏర్పుల సుదర్శన్, వీరునాయక్, హర్య, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయం
Published Thu, Sep 29 2016 1:48 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పరిపూర్ణం.. కోన సంబరం
ఉపాధికి మెండైన పాలి‘టెక్నిక్’
● ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె యువకుడు మృతి ● ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకారం
షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి
ట్రాన్స్కో వర్క్ ఆర్డర్లు పూర్తి చేయాలి
కౌంటింగ్పై అవగాహన తప్పనిసరి
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
వైభవం.. వసంతోత్సవం
తప్పక చదవండి
- బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
- ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
- భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
- సీఎం నిర్ణయాలే ఫైనల్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?
- టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement