విద్యుదాఘాతంతో రైతు మృతి | farmer dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Jul 8 2017 11:02 PM | Updated on Oct 1 2018 2:00 PM

విద్యుదాఘాతంతో రైతు మృతి - Sakshi

విద్యుదాఘాతంతో రైతు మృతి

మండలంలోని తూంచర్ల గ్రామంలో శనివారం విద్యుదాఘాతానికి గురై రైతు వన్నూరప్ప (42) మృతి చెందాడు.

కనగానపల్లి(రాప్తాడు) : మండలంలోని తూంచర్ల గ్రామంలో శనివారం విద్యుదాఘాతానికి గురై రైతు వన్నూరప్ప (42) మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు..  రైతు వన్నూరప్ప తన ఇంటి ముందు ఉన్న ఇనుప రేకులను పక్కకు సర్దుబాటు చేస్తుండగా, పైన ఉన్న విద్యుత్‌ తీగలు వాటికి తగిలాయి. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి.. కాపాడేలోపు అతడు మృత్యువాత పడ్డాడు.

అతడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మధ్యనే పొలంలో రెండు బోర్లు వేసి పంటలు సాగుచేశామని, అలాగే కూతురు పెళ్లి, కుటుంబ అవసరాల కోసం రూ.నాలుగు లక్షల దాకా అప్పు చేసినట్లు అతడి భార్య ముత్యాలమ్మ కన్నీటి పర్యతమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement