ఆటో బోల్తా : 8 మందికి గాయాలు | Eight injured in road accident in karimnagar | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : 8 మందికి గాయాలు

Jul 24 2015 9:24 AM | Updated on Sep 26 2018 3:36 PM

కరీంనగర్ జిల్లా కోరుట్ల శివారులో రహదారిపై శుక్రవారం ఆటో బోల్తా పడింది.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కోరుట్ల శివారులో రహదారిపై శుక్రవారం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. . జిల్లాలోని కథలాపూర్ మండలం దూలూరు నుంచి పుష్కర స్నానాలకు ఆటోలో వెళ్తుండగా కోరుట్ల సమీపంలో ఆటో బోల్తా కొట్టింది. దీంతో ఆటో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement