ముథోల్ మండలం బాసరలోని సరస్వతీ దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
ముథోల్ మండలం బాసరలోని సరస్వతీ దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణమాసం, వరుస సెలవులు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. 30 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 1,75 మంది చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించారు. రూ.11 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయూధికారులు తెలిపారు.